హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడాభీమ్గల్కు చెందిన శైలేష్ మృతి చెందడంపై బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదువు కోసం వెళ్లి మృత్యువాత పడటం కలచివేసిందని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. శైలేష్ మృతదేహాన్ని తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ఇండియన్ కాన్సులేట్, తానా నుంచి లక్ష్మీదేవి, తెలంగాణ ఎన్నారై డిపార్ట్మెంట్ అధికారి చిట్టిబాబుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పర్యవేక్షిస్తున్నారని వివరించారు.