తెలంగాణ పెట్టుబడుల స్వర్గధామంగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలకు మరింత ఊతమిచ్చే టీ హబ్- 2.0ను సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్లో ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ.. ఐటీ రంగాల్లో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, ఉత్పత్తుల సాధనే లక్ష్యంగా పనిచేసే సంస్థలకు తెలంగాణలో మార్కెట్ అవకాశాలను చూపడంతోపాటు పలు పరిశ్రమలకు చేయూతనందించేందుకు టీ హబ్ దోహదపడుతుందని తెలిపారు.
స్టార్టప్లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన టీ హబ్ను పార్లమెంట్ ఐటీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింన విషయాన్ని ఈ సందర్భంగా మహేశ్ బిగాల గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో మంత్రి కేటీఆర్ నిర్వహణలో ఐటీ రంగంలో తెలంగాణ ఎంతో ముందుకు వెళ్తున్నదని తెలిపారు. దేశంలోనే టీహబ్ రోల్ మోడల్గా నిలుస్తున్నదని చెప్పారు. తెలంగాణలో ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్తోపాటు ఆయన సహచర సభ్యులకు మహేశ్ బిగాల కృతజ్ఞతలు తెలిపారు.