హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసుశాఖను అత్యున్నత పతకాలు వరించాయి. రాచకొండ పోలీస్ కమిషనర్, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్తోపాటు హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీ (ఎన్సీ) దేవేందర్సింగ్కు రాష్ట్రపతి పోలీసు పతకాలు (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్) దక్కాయి. రాష్ర్టానికి చెందిన మరో 12 మందిని కేంద్ర పోలీసు పతకాలు వరించాయి. పతకాలు సాధించినవారిలో ట్రాఫిక్ ఐజీ ఏఆర్ శ్రీనివాస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అడిషనల్ ఎస్పీ పాలేరు సత్యనారాయణ, ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ పైళ్ల శ్రీనివాస్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీఎస్పీ ఎస్ వెంకటరమణమూర్తి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ చెరుకు వాసుదేవరెడ్డి, టీఎస్ పోలీస్ అకాడమీ డీఎస్పీ గంగిశెట్టి గురు రాఘవేంద్ర, రామగుండం ఎస్సై (సీఎస్బీ) చిప్పా రాజమౌలి, చౌటుప్పల్ ఏఎస్సై కాట్రగడ్డ శ్రీనివాస్ ఉన్నారు.