కల్వకుర్తి రూరల్, మే 9 : స్కూల్ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనగా ప్రభుత్వ డాక్టర్ మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో గైనకాలజిస్ట్గా విజయ్కుమార్(35) విధులు నిర్వర్తిస్తున్నాడు.
శనివారం ఉదయం బ్యాడ్మింటన్ ఆడి తన కారులో తిరిగి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ పాఠశాల బస్ ఢీకొన్నది. తీవ్ర గాయాలైన ఆయన్ను స్థానికులు దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయ్ సొంతూరు నారాయణపేట జిల్లా మక్తల్ కాగా.. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.