హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వానికి నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఫూలే బీసీలు, దళితులకే కాకుండా అన్నివర్గాలకు ఆదర్శవంతమైన వ్యక్తి అని కొనియాడారు. ఫూలే విగ్రహ ఏర్పాటుకోసం పోరాడుతున్న భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.