మహాత్మాగాంధీ 1910-1946 మధ్య కాలంలో తెలుగు రాష్ర్టాల్లో పలుమార్లు పర్యటించారు. హైదరాబాద్లో హరిజనోద్ధరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1927 ఏప్రిల్ 7న హైదరాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభకు మహాత్మాగాంధీ విచ్చేశారు.
నగరం నడిబొడ్డున ఉన్న వివేకవర్ధిని హైస్కూల్లో జరిగిన సభకు హాజరయ్యారు గాంధీజీ. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన చిన్న వేదికపై కూర్చొని గాంధీజీ సందేశం ఇచ్చారు. ఆ వేదిక ఇప్పటికీ వివేకవర్ధిని హైస్కూల్లో భద్రంగా ఉన్నది. విద్యాలయానికి వచ్చినపుడు సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు.