హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణపై మహారాష్ట్ర బృందం అధ్యయనం చేస్తున్నది. మహారాష్ట్రకు చెందిన అధికారులు గురువారం సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు రాష్ట్రంలోని భూముల వివరాలు, డిజిటలైజేషన్, ధరణి పోర్టల్ పనితీరు, ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు తదితర అంశాలను వారికి వివరించారు.