యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధ రామలింగేశ్వరుడి ఆలయంలో 20న ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజతో మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం చుడుతున్నారు.
20 నుంచి 25వరకు స్మార్తాగమ శాస్త్రం ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రామలింగేశ్వర స్ఫటిక లింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలకు సీఎం కేసీఆర్ హాజరవుతారు.