హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): సీనియర్ పాత్రికేయుడు వనం జ్వాలానరసింహారావు రచించిన ‘ఆస్వాదన – కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారత కథలు’ గ్రంథాన్ని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఆదివారం సాయంత్రం జూమ్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి బాలలకు, యువతరానికి మన సంస్కృతుల ఔన్నత్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. దర్శనం పత్రిక ప్రచురణకర్త మరుమాముల వెంకటరమణ శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చల్లా విశ్వనాథ శాస్త్రి, చిలుకపాటి విజయరాఘరాచార్య తదితరులు పాల్గొన్నారు.