శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు బుధవారం ఉదయం భ్రమరాంబ, మల్లికార్జున స్వామికి పూజలు నిర్వహించినట్టు ఈవో పెద్దిరాజు తెలిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల పుష్పపల్లకీ ఉత్సవం శోభాయమానంగా సాగింది.