హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ మహాయజ్ఞానికి భక్తుల నుంచి స్పందన రాకపోవడంతో మహా కుంభాభిషేకాన్ని వాయిదా వస్తున్నట్టు ఏపీ దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు ఆలయంలో నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక శ్రీచండీ రుద్ర రాజశ్యామ సుదర్శన సహిత లక్ష్మీ మహాయజ్ఞానికి భక్తుల నుంచి ఊహించిన స్పందన రాలేదు. వేసవి తీవ్రతే ఇందుకు కారణమని భావించిన దేవాదాయశాఖ ఈ నెల 25 నుంచి 31 వరకు నిర్వహించనున్న మహా కుంభాభిషేకాన్ని కార్తీకమాసానికి వాయిదా వేసింది.