హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్: మాదిగల జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కోరారు. రాష్ట్రంలో మాదిగ సమస్యలపై చర్చించేందుకు వరంగల్ వేదికగా ఈ నెల 23న రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాదిగలకు దళితబంధు అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రత్యేక వాటా వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.