హైదరాబాద్ : శాసన సభ బడ్జెట్ సమావేశాల(Budget meetings) నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) ప్రసంగిచారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం లాగా ఉందని మాజీ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారి(Madhusudanachari) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలోతెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రస్తావనే లేదన్నారు. కేఈఆర్ఎంబీ విషయంలో దక్షిణ తెలంగాణ ప్రజలు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.
కేఈఆర్ఎంబీ ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేకపోవడం విచారకరమన్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలోనే దేశంలో ఉన్నత స్థాయిలో కేసీఆర్ నిలిపారని పేర్కొన్నారు. అప్పులు తేకుండా మీరు అభివృద్ధి చేయగలరా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు జరిగే విధంగా రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.