హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ) చైర్మన్గా డాక్టర్ మధుశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హాజరై మధుశేఖర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్మన్ సహా మొత్తం 13 మందితో కార్యకలాపాలు నిర్వహించనున్నదని తెలిపారు. ఈ బోర్డ్లో హెల్త్ సెక్రటరీ వైస్ చైర్మన్గా, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, నిమ్స్ డైరెక్టర్, ఫైనాన్స్ సెక్రటరీ తదితరులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం శిక్షణ ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని పేర్కొన్నారు.
ప్రత్యేక ప్రజారోగ్యం, వైద్య రంగంలో వివిధ అధ్యయనాలను చేసేందుకు పరిశోధనా సంస్థగా పనిచేయనున్నదని మంత్రి వెల్లడించారు. డాక్టర్ మధుశేఖర్కు సీఎం కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారని చెప్పారు. మంత్రి వేముల మాట్లాడుతూ.. వైద్యరంగంలో విశేష అనుభవం కలిగిన చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ను ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్మన్గా సీఎం కేసీఆర్ నియమించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తనకు అత్యంత ఆప్తుడైన మధుశేఖర్కు ప్రతిష్ఠాత్మక పదవి రావడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఉంటున్న ఇన్స్టిట్యూట్ని కార్పొరేషన్గా మార్చి తొలి చైర్మన్గా డాక్టర్ మధుశేఖర్ను సీఎం కేసీఆర్ నియమించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్రావు, మహిళా సాధికారత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, మార్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠల్రావు తదితరులు పాల్గొన్నారు.