హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ)/ఆర్మూర్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్ఎఫ్) చైర్మన్గా డాక్టర్ బద్దం మధుశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేండ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థ ఇది. ఐఐహెచ్ఎఫ్ పాలక మండలిలో చైర్మన్ సహా మొత్తం 13 మంది సభ్యులు ఉంటారు. హెల్త్ సెక్రటరీ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. డీఎం ఈ, నిమ్స్ డైరెక్టర్, ఆర్థికశాఖ కార్యదర్శి తదితరులు దీనిలో ఉంటారు. గతంలో దీనికి చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఉండేవారు. మొదటిసారిగా ప్రభుత్వం ఆ పదవిని ఇతరులకు అప్పగించింది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని నిజామాబాద్ జిల్లా వేల్పూరులోని ఆయన నివాసంలో గురువారం మధుశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి తన నియామకంపై కృతజ్ఞతలు తెలిపారు. వైద్యరంగంలో విశేష అనుభవం కలిగిన వ్యక్తికి బాధ్యతలు అప్పగిచడం సంతోషంగా ఉన్నదని మంత్రి పేర్కొన్నారు.