హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/దుండిగల్: మహీంద్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా డీన్గా ప్రముఖ విద్యావేత్త, కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు నియమితులయ్యారు. ఆయన్ను స్కూల్ ఆఫ్ లా వ్యవస్థాపక డీన్గా నియమిస్తూ యూనివర్సిటీ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. మాడభూషి శ్రీధర్ గతంలో నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా, రిజిస్ట్రార్గా సేవలందించారు. 2021 -22 విద్యాసంవత్సరం నుంచి మహీంద్రా వర్సిటీలో న్యాయకోర్సుల కోసం స్కూల్ఆఫ్ లాను నెలకొల్పారు. దీం ట్లో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ బీబీఏ ఎల్ఎల్బీ (హానర్స్), బీఏ ఎల్ఎల్బీ (హనర్స్) కోర్సులను నిర్వహించనున్నట్టు వర్సిటీవర్గాలు తెలిపాయి.