హైదరాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) చైర్మన్గా మచ్చా శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.