హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లిన బండి సంజయ్కు పట్టిన గతే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి పడుతుందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోళ్లపై రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఉనికి కోసం రాజకీయ పర్యటనలు చేస్తున్న రేవంత్రెడ్డి, బండి సంజయ్కు కొనుగోళ్లు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న విధంగానే ధాన్యం విషయంలోనూ కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పదన్నారు. వానకాలం ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన పడొద్దన్నారు. ఇప్పటికే 5,100 కొనుగోలు కేంద్రాల ద్వారా 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు.