డిచ్పల్లి, మే 8: తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఎం యాదగిరి సోమవారం తిరిగి విధుల్లో చేరారు. ఉన్నత విద్యాశాఖ, వర్సిటీ పాలకమండలి ఆదేశాల మేరకు విధుల్లో చేరినట్టు యాదగిరి పేర్కొన్నారు. ఇటీవల వర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పాలకమండలి ఆమోదంతో రెండేండ్ల పాటు రిజిస్ట్రార్గా నియమితులైనట్టు ఆయన చెప్పారు. పాలకమండలి నిర్ణయాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కాగా, ఓయూ నుంచి వచ్చిన నిర్మలా దేవి పాత విధుల్లో చేరుతున్నట్టు ఓయూ రిజిస్ట్రార్కు లేఖ అందించారు.
వీసీ రవీందర్ గుప్తా అక్రమాలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలోనే విచారణ ప్రారంభవుతుందని టీయూ పాలకమండలి సభ్యులు వసుంధరాదేవి, గంగాధర్గౌడ్ చెప్పారు. వీసీ ఖర్చు చేసిన ప్రతీ పైసా ప్రభుత్వం రికవరీ చేస్తుందని స్పష్టం చేశారు. కాగా, తమకు వేతనాలు చెల్లించాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది ధర్నా చేయగా, పాలకమండలి సభ్యులు సిబ్బందితో మాట్లాడారు. వీసీ మూలంగా వేతనాలు ఆలస్యమైనట్టు గుర్తించామని, త్వరలోనే బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇవ్వడంతో సిబ్బంది ఆందోళన విరమించారు.