శంషాబాద్ రూరల్, జనవరి 17: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును బుధవారం ప్రారంభించారు. లుఫ్తాన్జా ఎయిర్లైన్స్ సంస్థ భాగస్వామ్యంతో శంషాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కు ఎయిర్పోర్టుకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.
వారానికి ఐదు రోజులు ఈ సర్వీసు ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల భారతదేశం నుంచి, ఉత్తర అమెరికా నుంచి 40 వేల మంది ప్రయాణికులు యూరప్లోని విమానాశ్రయాలను రవాణా కేంద్రాలుగా ఎంచుకుంటున్నారని ఎయిర్పోర్టు సీవో ప్రదీప్ పణికర్ తెలిపారు.