హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): దరఖాస్తులు తక్కువగా వచ్చిన 22 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారులు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆదిలాబాద్లో 9, ఆసిఫాబాద్లో 5, నిర్మల్లో 4, భూపాలపల్లిలో 3, కామారెడ్డిలో 1 దుకాణానికి రీటెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటికే వచ్చినవి, కొత్త దరఖాస్తులను కలిపి 29న లక్కీడ్రా తీస్తారు.