సిద్ధిపేట : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజీ వద్ద ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును.. మల్లారం స్టేజీ వద్దకు రాగానే.. ఎదురుగావస్తున్న లారి డైవడర్పై నుంచి దూసుకువచ్చి ఢీకొట్టింది. ఘటనలో కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తున్నది.