లబ్ధిదారులకు రూ.109.45 కోట్ల పరిహారం
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జిల్లా స్థాయిల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో రికార్డు స్థాయిలో 7.5 లక్షల కేసులు రాజీ అయ్యాయి. తద్వారా లబ్ధిదారులకు రూ.109.45 కోట్ల పరిహారం చేరనున్నది. అందులో ప్రీ లిటిగేషన్ కేసులు 8,175, విచారణలో ఉన్న పెండింగ్ కేసులు 7,41,825 పరిషారమైనట్టు సంస్థ సభ్య కార్యదర్శి జీ గోవర్ధన్రెడ్డి తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, హైకోర్టు కమిటీ చైర్మన్ జస్టిస్ పీ నవీన్రావు కృషి ఫలితంగా జిల్లాల్లోని వివిధ క్యాటగిరీలకు సంబంధించిన కేసులు పరిషారమయ్యాయని ఆదివారం ఒక ప్రకటనలో పేరొన్నారు.
హైకోర్టులో 629 కేసులు పరిష్కారం
హైకోర్టులో ఆదివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 629 కేసులను పరిషరించారు. న్యాయమూర్తులు జస్టిస్ జీ శ్రీదేవి, జస్టిస్ సాంబశివనాయుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జీ యతిరాజు అధ్యక్షతన వేర్వేరుగా ఈ కేసుల్లో రాజీ కుదిర్చారు. 1,150 మంది లబ్ధిదారులకు రూ.36.60 కోట్లు పరిహారంగా చెల్లించనున్నారు.