హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో లాక్డౌన్ యథాతథంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజక వర్గాల్లో లాక్డౌన్ యథావిధిగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడు నియోజవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే లాక్డౌన్ సడలింపు (మరో గంటపాటు గమ్యస్థానాలకు చేరుకునేందుకు వెసులుబాటు) ఉంటుంది. కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయా నియోజకవర్గాల్లో ఇటీవల రాష్ట్ర వైద్యాధికారుల బృందం పర్యటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ ఏడు నియోజక వర్గాల్లో లాక్డౌన్ను యథావిధిగా కొనసాగించాలని కేబినెట్కు ఈ బృందం సిఫారసు చేసినట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.