హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఫార్మా ఇండస్ట్రీతో 200 కిలోమీటర్ల మేర కాలుష్య ప్రభావం ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. ఎల్బీనగర్లో సిరీస్ ఫ్యాకర్టీతో వందల కిలోమీటర్లు కాలుష్యానికి గురైందని చెప్పారు. ఫార్మాసిటీతో ఇదే తరహాలో గాలి, నీరు కలుషితమయ్యేదని వివరించారు. తాను ఫార్మాసిటీని వ్యతిరేకించిన కారణంగానే 2018 ఎన్నికల్లో కొంత మంది ఫార్మా యజమానులు తనను కుట్రపన్ని ఓడించారని ఆరోపించారు. ఫార్మాసిటీని రద్దుచేయడంతో రంగారెడ్డి జిల్లావాసుల్లో పండుగ వాతావరణం నెలకొందని, ఫార్మాసిటీ ప్రాంతంలోని రైతులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు.