గొల్లపల్లి, ఏప్రిల్ 12: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండ లం బిబిరాజ్పల్లికి చెందిన రాజన్న (రఘునందన్)కు మంత్రి కొప్పుల ఈశ్వర్ అండగా నిలిచారు. వైద్యం కోసం రూ.4 లక్షలు అవసరమని వైద్యులు సూచించడంతో రాజన్న భార్య సుప్రజ హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కొప్పుల ఈశ్వర్ను కలిశారు. వెంటనే స్పందించిన ఆయన.. గంటన్నరలోనే రూ.2 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి ఆమెకు అందజేశారు.