మల్లాపూర్, మార్చి 10: అప్పటి దాకా బంధువుల కోలాహలంతో సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా రోదనలతో మిన్నంటింది. కూతురి పెండ్లయిన కొన్ని గంటలకే తండ్రి హఠాన్మరణం బంధుమిత్రులను కలిచివేసింది. ఈ ఘటనతో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాంరాజ్పల్లిలో విషాదం అలుముకున్నది.
లింబాద్రి (45) చిన్న కూతురి పెండ్లి గురువారం జరిపించారు. అప్పగింతలు సైతం పూర్తిచేశారు. రాత్రివేళ లింబాద్రి.. కుటుంబీకులు, బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. నిద్రలోనే గుండెపోటుగు గురై మరణించాడు. శుక్రవారం తెల్లవారుజామున విగతజీవిగా కనిపించిన ఇంటిపెద్దను చూసి కుటుంబ సభ్యులు బోరుమన్నారు.