హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమేనని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను దివాళా తీయించినట్టే సింగరేణిపై కూడా కేంద్రం కుట్ర చేస్తున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర శాఖ మంత్రి కే తారక రామారావు ఆరోపించారు. సింగరేణి పరిధిలో నాలుగు గనులను వేలం వేయనున్నట్టు కేంద్రం పార్లమెంటులో చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇది మోదీ సర్కారు కుట్ర అని, సింగరేణిని తన కార్పొరేట్ మిత్రులకు అప్పగించే ప్రయత్నమని విమర్శించారు. గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గనులు కేటాయించి, సింగరేణిలో వేలం వేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ఈ మేరకు మంత్రి కేటీఆర్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారం, ఆయువుపట్టు లాంటి సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, అందుకే బొగ్గు గనులను ప్రైవేటుకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తకువ కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలుస్తూ, అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణపై కక్ష కట్టిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడుగడుగున రాష్ర్టాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. అం దులో భాగంగానే సింగరేణి గనులను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింన్నారు.
గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జీఎండీసీ)కి కేంద్రం నామినేషన్ పద్ధతిన లిగ్నైట్ గనులను కేటాయించడాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. జీఎండీసీకి గనుల కేటాయింపు, వాటి పర్యావరణ అనుమతులకు సంబంధించిన పత్రాలను ఈ సందర్భంగా విడుదల చేశారు. సింగరేణికి కూడా అదేవిధంగా వేలం వేయనున్న బొగ్గు గనులను కేటాయించాలని అనేక రోజులుగా తమ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. ఎప్పటి మాదిరే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుజరాత్కు ఒక న్యాయం తెలంగాణకు ఇంకొక న్యాయం అన్నట్టుగా పక్షపాతంతో వ్యవహరిస్తూ తీరని అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.
ప్రధానమంత్రి పీఠంపై కూర్చోగానే గుజరాత్పై పక్షపాతంతో 2014 ఆగస్టులోనే లిగ్నైట్ గనులను జీఎండీసీకి ఇచ్చేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ తరువాతి సంవత్సరం జూలై 27న కేంద్రం, లిగ్నైట్ బొగ్గు గనులను గుజరాత్ సంస్థకు కేటాయించారని పేర్కొన్నారు. జీఎండీసీకి జరిగిన కేటాయింపులను, 2018లో దానికి సంబంధించిన జారీచేసిన పర్యావరణ అనుమతుల పత్రాలను సైతం కేటీఆర్ విడుదల చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని రాష్ట్ర ప్రజలతో పాటు బొగ్గు గని కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. సొంత రాష్ట్రం కోసం తమ వేలం పాలసీలను పకన పెట్టిన ప్రధానమంత్రి, తెలంగాణ సమాజంపై ఈర్ష్యతో సింగరేణి గనులకు వేలం వేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ పట్ల ఈ పక్షపాతం ఇంకెన్ని రోజులు అంటూ మండిపడ్డారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని, ఇప్పుడు నాలుగు గనులను వేలానికి పెట్టడం వారి ద్వంద్వ ప్రమాణాలకు, బూటకపు మాటలకు అద్దం పడుతున్నదని కేటీఆర్ దుయ్యబట్టారు. కేవలం నష్టాల్లో ఉన్న కంపెనీలను అమ్ముతామంటూ కల్లబొల్లి మాటలు చెప్పే బీజేపీ ప్రభుత్వం, ఉత్పత్తిలో.. లాభాల్లో ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిని తన కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని గత సంవత్సరం డిసెంబర్ ఏడున సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని, అయినా కేంద్రప్రభుత్వం కార్మికుల ఆందోళనలను, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను పట్టించుకోకుండా మొండిపట్టుతో ముందుకు పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి పరిధిలోని బొగ్గు గనులన్నింటిని ప్రైవేట్కు అప్పగిస్తే సంస్థకు పనేమి మిగులుతుందని ప్రశ్నించారు. బొగ్గు బావులకు వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమేనన్నారు.
గనుల ప్రైవేటీకరణ సింగరేణి విస్తరించిన ఏడెనిమిది జిల్లాల సమస్య కాదని, సమస్త తెలంగాణ అంశమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్ర అని కేటీఆర్ పేర్కొన్నారు. బోర్ల నీటిపై ఆధారపడిన రాష్ట్ర వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, పంట భూములను పచ్చగా మారుస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంటు కష్టాలు కల్పించి, తెలంగాణ రైతన్నలకు మోదీ సరారు తీరని అన్యాయం చేసే కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు.
రాష్ట్ర థర్మల్ పవర్ జనరేషన్లో సింగరేణి పాత్ర అ త్యంత కీలకమైనదని, అలాంటి సింగరేణిని ప్రైవేటీకరిస్తే దేశంలో ఎకడా లేనివిధంగా వ్యవసాయాకి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటలపాటు ఇస్తున్న విద్యుత్తు సరఫరాను దెబ్బతీయవచ్చన్న కుట్రపూరిత ఆలోచనతోనే కేంద్రం సింగరేణిపై కక్ష కట్టిందని వెల్లడించారు. రైతులకు, రాష్ట్రంలోని దళిత, గిరిజన, కులవృత్తులకు ఇస్తున్న ఉచిత విద్యుత్తును దూరం చేసేలా రూపొందించిన నూతన విద్యుత్తు సంసరణల చట్టాన్ని తెలంగాణ బలంగా అడ్డుకుంటున్నదని, అందుకే పరోక్షంగా రాష్ట్ర విద్యుత్తు రంగాన్ని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.
సింగరేణిని ప్రైవేటీకరిస్తే తెలంగాణ చీకట్లోకి జారుకుంటుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు శ్రమదోపిడికి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాలలో రిజర్వేషన్లు, వారికిచ్చే బోనస్లు, అలవెన్స్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతాయని తెలిపారు. 150 సంవత్సరాలకు పైగా తెలంగాణకు మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి చీకటి సూర్యుల బతుకులను చిదిమెసే కుట్రలు ఇకనైనా ఆపాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. సింగరేణి ప్రైవేటీకరణ ద్వారా సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారత థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందని, ఈ విషయాన్ని దేశ ప్రధానమంత్రి అర్థం చేసుకోవాలని కోరారు.
సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, వారికి టీఆర్ఎస్ అండగా ఉంటున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా గనుల వేలంపై ముందుకు వెళితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం సింగరేణి నుంచి ఉవ్వెత్తున ఎగిసినట్టుగానే, మరోసారి కేంద్రానికి, సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరో ఉద్యమా సింగరేణి భుజం పై నుంచి తెలంగాణ ప్రజలపైకి గన్ను పెడుతున్న కేంద్రం తీరుని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలకు వ్యతిరేకంగా గొంతు ఎత్తాలని, రాష్ట్ర ప్రజల పట్ల తమ నిబద్ధతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. తమ ఎంపీలు బొగ్గు గనుల వేలం అంశంపై పార్లమెంటులో నిలదీస్తారని స్పష్టంచేశా రు. తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడిపై దెబ్బ కొట్టాలని చూస్తున్న కేంద్రం కుట్రలపై పోరాడేందుకు కలిసి రావాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి కేటీఆర్ పిలుపునిచ్చారు.