పెద్దపల్లి : మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే నని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి నదిలో రూ. 40లక్షల విలువల గల చేప, రొయ్యపిల్లలను వదిలిన సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు. పంటలకు సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు, ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు.
అంతేకాకుండా కాలేశ్వరంతో మత్స్య సంపద అభివృద్ధి చెందిదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాహిత సంక్షేమ పథకాలను అందిస్తుండడంతో ప్రతి ఇంట ఆనందం వెల్లివిరుస్తుందని అన్నారు. మత్స్యకారులకు ఆర్థిక భరోసా పెరిగిందని వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్,డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక రావు, డీఎఫ్ఓ భాస్కర్ నాయక్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.