హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి కర్ణాటక ఉత్తర ప్రాంతం నుంచి తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నదని పేర్కొన్నది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపింది. శనివారం జీహెచ్ఎంసీతోపాటు నిజామాబాద్, జోగుళాంబ గద్వాల, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ స్వల్ప వర్షపాతం నమోదైంది.