పెద్దపల్లి: పెద్దపల్లిలోని సింగరేణి (Singareni) బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకున్నది. గురువారం తెల్లవారుజామున గోదావరిఖని 11 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. ఎల్హెచ్డీ యంత్రం నుంచి కిందపడి ఇజ్జగిరి ప్రతాప్ అనే ఆపరేటర్ మృతి చెందారు. ఎల్హెచ్డీ యంత్రం గోడను ఢీకొట్టడంతో.. మిషన్ కింద పడిపోయి ఆపరేటర్ అక్కడిక్కడే చనిపోయారు. దీంతో ఆయన మృతదేహన్ని సింగరేణి ఏరియా దవాఖానకు తరలించారు.
ప్రతాప్ మృతదేహానికి టీబీజీకేఎస్ నేతలు మిర్యాల రాజిరెడ్డి, తదితరులు నివాళులర్పించారు. ఆయన స్వగ్రామం రామగిరి మండలం పన్నూరు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.