జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ పాల్గొని భూపాలపల్లి పట్టణంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు పట్టణ, పల్లె ప్రగతి ప్రాముఖ్యతలను తెలుసుకొని సహకరించాలని కోరారు. పట్టణ ప్రగతి చేపట్టిన ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చి ఆరోగ్య తెలంగాణకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.