నారాయణపేట: జిల్లాలోని కోస్గిలో చిరుత పులులు కలకలం సృష్టిస్తున్నాయి. కోస్గి సమీపంలో ఉన్న గుట్టపై రెండు చిరుత పులులు మకాం వేశాయి. గ్రామంలోని కుక్కలు, గొర్రెలను చంపేస్తున్నాయి. గ్రామంలో పులులు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పొలం పనులకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు.
చిరుతలు సంచరిస్తున్న విషయాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత తొందరగా పులులను పట్టుకోవాలని కోరుతున్నారు. కాగా, చిరుతల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాయంత్రం వేళ ఒంటరిగా బయట తిరుగొద్దన్నారు.