సంగారెడ్డి: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత పులి కలకలం సృష్టించింది. పారిశ్రామికవాడలోని హెటిరో (Hetero) కంపెనీలో గురువారం రాత్రి కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ ఆవరణంలో చిరుత అని భయపడి కార్మికులు పరుగులుతీశారు. సమాచారం అందుకున్న అటవీశాక అధికారులు కంపెనీలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే ఎక్కడా చిరుత ఆనవాలు కనిపించలేదని చెప్పారు. దీంతో అది చిరుత పులేనా లేకా వేరే ఎదైనా జంతువా అనే కోణంలో విచారిస్తున్నారు.