కామారెడ్డి: జిల్లాలోని బిర్కూరులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. బిర్కూరులో చిరుత సంచరిస్తుండగా గ్రామస్తులు చూశారు. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న అధికారులు చిరుత సంచరించిన స్థలాన్ని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, గ్రామంలో చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత తొందరగా దానిని పట్టుకోవాలని అధికారులను కోరారు.