జక్రాన్పల్లి, సెప్టెంబర్ 1: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడం చిరుత మృత్యువాతపడింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ శివారులో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. జక్రాన్పల్లి ఎంపీడీవో సతీశ్కుమార్ విధులు ముగించుకుని రాత్రి 8.30 గంటల సమయంలో నిజామాబాద్కు వెళ్తుంగా, పడకల్ శివారులోని జాతీయ రహదారిపై చిరుత పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందింది.