గద్వాల/వెల్దండ/మక్తల్టౌన్/మాగనూరు, మే 8 : కాంగ్రెస్, బీజేపీ మాయమాటలతో విసుగుచెందిన కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కల్వకుర్తి, మక్తల్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం లో గద్వాల పట్టణంలోని 15వ వార్డుకు చెందిన 50 మంది నాయకులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్కు చెందిన కాంగ్రెస్ నాయకులు సిద్ధగోని రమేశ్గౌడ్తో పాటు 50 మంది కార్యకర్తలు, చారకొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరాజు, కొట్రకు చెందిన నాయకులు బూత్కురి మహేశ్, కొప్పు సాయికుమార్ మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చిట్టెం నివాసంలో కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 50 మంది యువకులు, మాగనూరు మండలం నేరేడుగం గ్రామంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 39 మంది నాయకులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.