హైదరాబాద్ : సెర్ప్ ఉద్యోగులు, ఐకేపీ, వీఓఏలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందజేస్తామని అసెంబ్లీ లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇందుకు ఎంతగానో కృషి చేసి, సీఎం కేసీఆర్ను ఒప్పించి తమకు బాసటగా నిలిచిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని రాష్ట్ర వీఓఏల సంఘం అధ్యక్షురాలు మాధవి నేతృత్వంలో పలువురు ఉద్యోగులు అసెంబ్లీ లాబీల్లో కలిశారు.
ఈ సందర్భంగా మంత్రికి వారు తమ కృతజ్ఞతలు తెలిపారు. సెర్ప్, ఐకేపీ, ఉద్యోగులు, వారి కుటుంబాలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటాయన్నారు.