హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శనివారం వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నగరంలో అత్యధికంగా ఎల్బీనగర్లో 10.6 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అంబర్పేటలో 10.4, ఉప్పల్లో 10.2, షాబాద్లో 9.6, సింగపూర్ టౌన్షిప్లో 9.1, హిమాయత్నగర్లో 8.1, మలక్పేటలో 7.2, చర్లపల్లిలో 7.8, నాచారంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా కందువాడలో 8.7, కందువాడలో 8.7, ఆరుట్లలో 7, సూర్యాపేట జిల్లా నాగారంలో 9.5, మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో 8.9, జడ్చర్లలో 8 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయింది.
అలాగే జగిత్యాల జిల్లా కథలాపూర్లో 7.6, కోరుట్లలో 6.9, వరంగల్ మంగళవారిపేటలో 7, యాదాద్రి జిల్లా తుఫ్రాన్పేటలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇవాళ కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెంతడడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.