హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : లాసెట్ కౌన్సెలింగ్ను ఈ నెల 13 తర్వాత ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. దీపావళి తర్వాత రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టాలని భావిస్తున్నారు. గురువారం లాసెట్ ప్రవేశాల కమిటీ సమావేశమై, షెడ్యూల్ విడుదల చేయనున్నది.
రాష్ట్రంలో లాసెట్ పరీక్ష మే 25న నిర్వహించగా, జూన్ 12న ఫలితాలు విడుదల చేశారు. మూడేండ్ల లా కోర్సులో 78.59 శాతం, ఐదేండ్ల లా కోర్సు ప్రవేశపరీక్షలో 80.21శాతం, పీజీ లా సెట్లో 94.36శాతం అభ్యర్థులు అర్హత సాధించారు.