కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం రాంనగర్, గౌరీ, కేలీ(బీ) అటవీ ప్రాంతా ల్లో ఏర్పడిన లావా రాతి స్తంభాలను కొత్త తెలంగాణ చరిత్రకారుల బృందం నిపుణులు చకిలం వేణుగోపాల్, గిత్తె తిరుపతి, శ్రీరామోజు హరగోపాల్ గుర్తించారు.
కాలమ్నార్ బసాల్ట్స్ (లావా రాతిశిలలు)ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో గుర్తించినట్టు తెలిపారు. ఆరున్నర కోట్ల ఏండ్ల క్రితం భూగర్భంలోని రంధ్రాల నుంచి పైకి వచ్చిన లావా శిలలుగా మారిందని వెల్లడించారు. మహారాష్ట్రలోని అంధేరి, గిల్బర్ట్ హిల్స్, కొల్లాపూర్, ఉస్మానాబాద్, బీడ్, చించోలిలో ఈ కాలమ్నార్ బసాల్ట్స్ కనిపించాయని తెలిపారు.