హైదరాబాద్, డిసెంబర్28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన లక్ష్మీపంప్హౌస్ (కన్నెపల్లి)లో 5వ మోటర్ను అధికారులు పున:ప్రారంభించారు. అసాధారణ రీతిలో కురిసిన వర్షాలతో నీటమునిగిన పంప్హౌస్ను అధికారులు ఇటీవలే పునరుద్ధరించారు. అందులో భాగంగా పంప్హౌస్లో 40 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 17 మోటర్లు ఉండగా, ఇప్పటికే 4 మోటర్లను అధికారులు ఇటీవల పునఃపారంభించారు. పంప్హౌస్లోని 5వ మోటర్ను రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇంజినీరింగ్ అధికారులు బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించారు. పంప్ జయప్రదంగా యథావిధిగా నీటిని ఎత్తిపోయడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.