హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తన 47వ పుట్టిన రోజు సందర్భంగా 94 మంది అనాథ పిల్లలకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసుఫ్గూడ స్టేట్ హోంలో పిల్లలకు ల్యాప్టాప్లు అందించనున్నట్టు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. వారికి రెండేండ్లపాటు శిక్షణ ఇప్పిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటనలకు కాకుండా అనాథ పిల్లలను ఆదుకొనేందుకు డబ్బులు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.