హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల(2023-24బ్యాచ్) ల్యాంప్లైటింగ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వార్షిక స్పోర్ట్స్మీట్లో గెలుపొందిన 50మంది విద్యార్థినులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్) కృష్ణకాంత్, ఓఎస్డీ సైదిరెడ్డి, తార్నాక దవాఖాన సీఎంవో డాక్టర్ శైలజామూర్తి, అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్) రామ్మోహన్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వసుంధర తులసి, వైస్ప్రిన్సిపాల్ సోని తదితరులు పాల్గొన్నారు.