శేరిలింగంపల్లి, జూలై 30 : శేరిలింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలోని గోపన్పల్లి ఈద్గోనికుంట ఆక్రమణదారులకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. చెరువును ధ్వంసం చేసి డంపింగ్ చేపట్టారన్న ఆరోపణలపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్శాఖలు సంయుక్తంగా గౌలిదొడ్డి గ్రామానికి చెందిన రాజు, ప్రకాశ్లకు రూ.1.10 కోట్లు, డంపింగ్ తొలగింపు కోసం రూ. 74 లక్షలు కలిపి మొత్తం రూ. 1.84 కోట్ల జరిమానా విధించాయి. గోపన్పల్లి సర్వే నంబరు 71లో 5.3 ఎకరాల్లో విస్తరించిన ఈద్గోనికుంటను ఓ బడా నిర్మాణ సంస్థ స్థానిక కబ్జాదారులతో కలిసి ఆక్రమణకు తెరలేపింది.
కుంటను అభివృద్ధి చేసి సుందరీకరణ పనులు చేపడుతున్న సమయంలో కబ్జాదారులు బండలు, మట్టికుప్పలతో పూడ్చివేశారు. ఆక్రమణపై సమాచారం అందుకున్న ఇరిగేషన్ ఏఈ జ్యోతిర్మయి పక్కా ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చెరువు ధ్వంసం, అక్రమ డంపింగ్పై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్శాఖలు కలిసి నిందితులకు భారీ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశాయి.