జూబ్లీహిల్స్, నవంబర్ 30: లక్ష్మి హ్యుందాయ్ 25వ వార్షికోత్సవాన్ని గురువారం హైదరాబాద్లోని ఎల్బీనగర్ బ్రాంచ్లో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ కంభంపాటి రామ్మోహనరావు, హెచ్ఎంఐఎల్ సీవోవో తరుణ్ గార్గ్, మేనేజింగ్ డైరెక్టర్ జైరామ్ సీనియర్ మాట్లాడుతూ 25 ఏండ్లుగా హ్యుందాయ్కు మద్దతుగా నిలిచిన వినియోగదారులు, ఉద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
లక్ష్మి గ్రూప్ 1988 లో 120 వాహనాల నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి 14000 వాహనాలకు ఎదగడంలో కస్టమర్ల ప్రోద్బలం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన హ్యుందాయ్ డీలర్లు ప్రౌడ్ డీలర్లు పాల్గొన్నారు.