పెద్దపల్లి, జూలై 15 (నమస్తే తెలంగాణ)/మహదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టులకు వరద స్వల్పంగా తగ్గింది. శుక్రవారం ఎల్లంపల్లికి 2,94,429 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 29 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. 20.17 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో 15.32 టీఎంసీల స్థిరమైన నీటిమట్టం ఉండేలా చూస్తున్నారు.
పార్వతీ బరాజ్లోకి 2,93,912 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా నికరంగా నీటిని నిల్వ ఉంచకుండానే దిగువకు బరాజ్కు వదులుతున్నారు. లక్ష్మీ బరాజ్కు గురువారం 28,40,060 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 22,82,850 క్యూసెక్కులకు తగ్గింది. అంతే మొత్తంలో అవుట్ఫ్లోగా విడుదల అవుతున్నది.