మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి బరాజ్లోకి వరద ప్రవాహం పెరిగింది.
ప్రాజెక్ట్ పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.8 టీఎంసీల నీరు ఉంది.
గురువారం ఇన్ ఫ్లో 33,600 క్యూసెక్కులు ఉండగా శుక్రవారం 92,700 క్యూసెక్కులకు పెరిగింది. అవుట్ ఫ్లో 92,729 క్యూసెక్కులుగా ఉంది. 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇంజినీరింగ్ శాఖ డీఈ సురేశ్, ఏఈ షేక్ వలీ తెలిపారు.