Warangal | కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీళ్ల పాలవుతున్నారు. నీళ్లు, కరెంట్ లేక సకాలంలో ఎరువులు, పురుగు మందులు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. మరికొంత మంది రైతులు అప్పుజేసి పంటలు పండించి అప్పుల పాలవుతున్నారు. ఈ క్రమలో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన లక్ష్మి మహిళా రైతు రేవంతన్నా రైతులను ఆదుకోవాలని ఫ్లక్సీని ఏర్పాటు చేడం రైతుల పరిస్థితికి అద్దం పడుతున్నది.
ఈ సంవత్సరం అప్పు తెచ్చి పంట వేస్తే వర్షాలు కురవక, కాలువలో కూడా నీరు వదలక పంట ఎండిపోయిం దని ఆవేదన చెందారు. పంట కోసం అప్పులు చేశామని, బ్యాంకు లోన్ కట్టే పరిస్థితిలో లేమని రైతులను ఆదుకోవాలని పొలంలో ఫ్లెక్సీ కట్టి సదరు మహిళా రైతు లక్ష్మి నిరసన తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రేవంత్ అన్నా మా రైతులను ఆదుకోండి
పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన మహిళా రైతు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో మహిళా రైతు లక్ష్మి ఆవేదన
ఈ సంవత్సరం అప్పు తెచ్చి పంట వేస్తే వర్షాలు కురవక, కాలువలో కూడా నీరు వదలక పంట ఎండిపోయిందని ఆవేదన
పంట కోసం అప్పులు చేశామని,… pic.twitter.com/1ERIWOcSB2
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2026