హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉన్నత విద్య గెజిటెడ్ అధికారుల సంఘం (టీహెచ్ఈజీవోఏ) నూతన అధ్యక్షుడిగా ఎం లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. నాంపల్లిలోని ప్రొఫెసర్ జయశంకర్భవన్లో మంగళవారం అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. టీజీవో నగరశాఖ అధ్యక్షుడు గండూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 2021-23 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. ప్రధాన కార్యదర్శిగా జీ వెంకటేశ్వర్లు, సలహాదారులుగా డాక్టర్ రాజేందర్సింగ్, ఓబిలిరాణి, జయప్రదాబాయి, డాక్టర్ శ్రీనాథ్, గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ ఏ పుల్లయ్య, ఉపాధ్యక్షులుగా పీ పద్మలత, గిరిబాబు, ఎల్ భీంసింగ్, పీఎం ప్రసన్నలత, డాక్టర్ రఘు, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ పీవీ రఘు, ఎస్ఏ ఖదీర్, ఏ స్వామి, విజయ్కుమార్, విష్ణుప్రియ, బాబురావు, డీ వెంకటేశ్వర్లు, సూర్యప్రసాద్, కోశాధికారిగా ఎం విజయ్కుమార్ ఎన్నికయ్యారు.